S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 07:10

షాద్‌నగర్, డిసెంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ ఎపిజివిబి బ్యాంకు దోపిడీ కేసులో ఉగ్రవాదుల హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీస్ ఉన్నత స్థాయి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పలు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

12/21/2015 - 07:08

సంగారెడ్డి, డిసెంబర్ 20: విశ్వశాంతి, రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ చండీమాత ప్రసన్నం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించతలపెట్టిన అయుత మహా చండీయాగం ప్రాంగణం మొత్తం చూడచక్కని పద్ధతుల్లో తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక ఏర్పాట్ల జోలికి వెళ్లకుండా సాధుసంతులకు ఇష్టమైన కుటీరాలను ఏర్పాటు చేసి వాటిల్లో బస కల్పించనున్నారు.

12/21/2015 - 07:04

ఖమ్మం, డిసెంబర్ 20: వైకుంఠ రాముడు జగదభిరాముని జలవిహారం ఆదివారం రాత్రి పవిత్ర గోదావరి నదిలో వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, ఆనందోత్సాహాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణలు, కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, దిక్కులు పిక్కటిల్లేలా ‘జైశ్రీరాం’ అనే నినాదాలు, కళ్లు మిరుగుట్లు గొలిపేలా ఆకాశంలో బాణసంచా వెలుగుల మధ్య సీతా సమేతుడై శ్రీరామచంద్రుడు పావన గోదావరి నదిలో విహరించారు.

12/21/2015 - 07:01

కందుకూరు, డిసెంబర్ 20: పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఓవైపు కాల్‌మనీ వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా కందుకూరు ప్రాంతంలో మాత్రం వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 3వ వార్డు ఉప్పుచెరువులో ఆదివారం ఫైనాన్స్ వ్యాపారి దాష్టీకానికి ఓ కుటుంబం రోడ్డున పడింది.

12/21/2015 - 07:01

రామచంద్రపురం, డిసెంబర్ 20: దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ ఉత్తర ద్వారం సమీపంలో శ్రీఅతిరుద్రం మహాయజ్ఞం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రం శ్రీమణిద్వీప మహాసంస్థానానికి చెందిన భగవతీ శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది.

12/21/2015 - 07:00

విశాఖపట్నం, డిసెంబర్ 20: కాల్ మనీ కేసులో ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చీటీ మొత్తాన్ని చెల్లించాలంటూ తన తల్లిపై వత్తిడి తెచ్చినందుకు అవమానాన్ని భరించలేక ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం విశాఖలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కంచరపాలెం సమీపంలోని పెదకొత్తూరులో మైలపల్లి గరగయ్య నివసిస్తున్నాడు. ఇతడు రాడ్ బెండర్‌గా పనిచేస్తున్నాడు.

12/21/2015 - 06:59

రామచంద్రపురం, డిసెంబర్ 20: పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు... నిజంగా నరకం ఉందో లేదో కానీ, ఓ పుత్రుడు మాత్రం కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి చేతికి వైర్లు చుట్టి, విద్యుదాఘాతానికి గురిచేయడం ద్వారా హత్యచేశాడు. వళ్లు జలదరించే ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదూరు గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకుంది.

12/21/2015 - 06:33

హైదరాబాద్, డిసెంబర్ 20: పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడంతోపాటు ప్రచురణకర్తలకు ఊపిరిపోస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ కృషి శ్లాఘనీయమైనదని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఆదివారం హెదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలోని రచయిత సుద్దాల హన్మంతు వేదికపై ‘ఎడిటర్స్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దినపత్రికలకు చెందిన సంపాదకులు హాజరయ్యారు.

12/21/2015 - 06:30

తిరుమల, డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించి, వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వీరికి సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండి ఆలయం లోపలకు అనుమతించడానికి టిటిడి చర్యలు చేపట్టింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Pages