S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో రెడ్జోన్ ప్రకటించిన ప్రాంతంలో పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకుంటూ మిగిలిన ప్రాంతంలో అధికారులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండా లాక్డౌన్ ఆంక్షలను అధికార యంత్రాంగం కట్టుదిట్టం చేస్తునే వైరస్ బాధిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు గుర్తించి ఆంక్షలు కఠినతరం చేస్తు వైరస్ విస్తరించకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మడికొండ లేదా ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
వనపర్తి, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండగా వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ జ్వరాలు వ్యాపించి అటు ప్రజలను, అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
సంగారెడ్డి, ఏప్రిల్ 13: విరుగుడు లేని మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం ఏకమై పని చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పనికట్టుని చేస్తున్న విమర్శలను చూస్తుంటే కరోనాను మించిన వైరస్ ఏదో ఆవహించేదేమో అన్న అనుమానం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: రోమ్ నుండి ఢిల్లీకి చేరుకున్న 42 మంది విద్యార్థులు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ రామచందర్రావు జోక్యంతో వారందరినీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ చేర్చినట్టు బీజేపీ రాష్ట్ర కమిటీ పేర్కొంది.
హైదరాబాద్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ కార్యాలయం కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు విశేష సేవలు అందిస్తున్న వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ పరికరాలను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని ఎన్టీపీసీ ప్రకటనలో పేర్కొంది. గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులకు ఈ పరికరాలను అందచేశారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ పరికరాలను అందచేశారు.
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారత్కు చెందిన వైద్యులు కోవిడ్-19కు చెందిన వైరస్ మహమ్మారిపై పోరాటం చేయాలని, ఈ వైరస్ బారి నుంచి మానవాళిని కాపాడాలని గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఓరిజన్, ది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిజీషియన్స్ ఆఢఫ్ ఇండియన్ ఆరిజన్, బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ పిలుపునిచ్చాయి.
షాద్నగర్, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ వివరించారు. సోమవారం కమ్యూనిటీ ఆసుపత్రిలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రావద్దని ఫొన్ ద్వారా వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే టెలి మెడిసిన్ ద్వారా సూచనలను చేస్తామని వివరించారు.