S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సైదాబాద్, మార్చి13: లాక్డౌన్ పరిస్థితులలో నిరాశ్రయులు ఆకలికి అలమటించకుండా అయ్యప్ప పాదయాత్ర సేవాసమితి ఆదరించటం అభినందనీయమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మలక్పేట, యాకత్పురా, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని పలుప్రాంతాలకు చెందిన దినసరి కూలీలు నిరుపేదలు 500 మందికి 17 రోజులుగా సేవాసమితి ప్రతినిధులు ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు.
ఎక్కువ కేసులు ఇక్కడి నుంచే..* నగరాన్ని జోన్లుగా విభజించి యూనిట్లుగా ఏర్పాటు*
కంటైనె్మంట్లలో పకడ్బందీ ఏర్పాట్లు* రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలి*
ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
*
హైదరాబాద్, ఏప్రిల్ 13: వలస కార్మికులకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. అయితే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల యోగక్షేమాలను కేటీఆర్ స్వయంగా సోమవారం వివిధ కన్స్ట్రక్షన్ సైట్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని, కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ సోమవారం నాడు పిలుపునిచ్చారు. నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ కార్యాలయంలో మాస్క్ల ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల మాస్క్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఆదివారం వరకు 531 మందికి కరోనా సోకినట్టు ప్రకటించగా, సోమవారం నమోదైన 61 పాజిటివ్ కేసులను కలిపి మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 592కు చేరినట్టయింది.
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భుతంగా ఉందని, ఈ పంటల కొనుగోలుకు బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఒక టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ, రబీలో 40 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 10 లక్షల ఎకరాల్లో పల్లీ, ఉద్యాన తదితర పంటలు వేశారని గుర్తు చేశారు.
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలపై సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ బాధితుల కోసం కనీసం 400 బెడ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో ముగుస్తున్న 21 రోజుల లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశాలున్నాయ. కరోనా వైరస్ను కట్టడి చేస్తూనే లాక్డౌన్ కారణంగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండంచెల విధానాన్ని అవలంబించవచ్చునని అంటున్నారు.
కర్నూలు, ఏప్రిల్ 13: కర్నూలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఎక్కడి వరకు వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1243 మంది అనుమానితులకు సంబంధించి పరీక్షలు నిర్వహించగా వారిలో 84 మందికి కరోనావ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది.
అమరావతి, ఏప్రిల్ 13: గ్రామస్థాయిలో పంటల కోనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో ఇబ్బందిపడే అవకాశం ఉండటంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్ఫెడ్ చర్యలు చేపట్టింది.