జాతీయ వార్తలు

ఏపి సిఎం చంద్రబాబుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దళితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు ప్రతాప్‌కుమార్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఏ పోలీస్ స్టేషన్లలోనూ కేసు నమోదు చేయడం లేదని, దళిత వ్యతిరేక వ్యాఖ్యలపై సీబీఐ దర్యాప్తు జరిపేలా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతాప్‌కుమార్ సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను, వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను కమిషన్‌కు అందజేశానన్నారు. చంద్రబాబు దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.