రాష్ట్రీయం

ఆ ఎనిమిదిమందీ గైర్హాజర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: వైకాపా నుండి ఇటీవల తెలుగుదేశంలోకి ఫిరాయించిన 8 మంది సభ్యులు సోమవారం సభకు డుమ్మా కొట్టారు. వైకాపా విప్ జారీ చేసిందని తెలిసీ వారు గైర్హాజర్ కావడంతో వారి భవిష్యత్తు ఏమవుతుందనే విషయమై లాబీల్లో సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. టిడిపిలోకి ఫిరాయించిన వారిలో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, డేవిడ్ రాజు, జయరాములు, కలమట వెంకటరమణ, మణిగాంధీ ఉన్నారు. జగన్ ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తాము సభ్యులకు ఇమెయిల్ ద్వారా విప్ సమాచారాన్ని పంపించామని పేర్కొన్నారు. విప్ జారీ చేసిన తర్వాత సభకు వచ్చి వ్యతిరేకంగా ఓటు చేసినా, లేదా సభకు గైర్హాజరైనా వారు అనర్హులవుతారని జగన్ వివరించారు. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలూ విప్‌ను ధిక్కరించిన నేపథ్యంలో వైకాపా తదుపరి వ్యూహమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది.