ఆంధ్రప్రదేశ్
డిటిసి అక్రమాస్తులు రూ. 80 కోట్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 April 2016
కాకినాడ: ఇక్కడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న మోహన్కు 80 కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులున్నట్లు ఎసిబి అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాకినాడతో పాటు చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్లో మోహన్, ఆయన బంధువుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. తెలంగాణ,కర్నాటకలోనూ సోదాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆయనకు 40 ఎకరాల భూములు, డజన్ల కొద్దీ ఇళ్లస్థలాలు, అనేక భవనాలు, భారీగా వెండి, బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. మోహన్ కుమార్తె పేరిట అయిదు కంపెనీలు, స్థలాలు ఉన్నాయని సమాచారం. సోదాలు పూర్తయితే కానీ ఆస్తిపాస్తుల వివరాలు పూర్తిగా తెలియవని ఎసిబి అధికారులు అంటున్నారు.