ఆంధ్రప్రదేశ్
కొవ్వూరులో ఐదుగురి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 August 2016
కొవ్వూరు:పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారుపేట వద్ద గురువారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. అయినవిల్లి మండలం నేదునూరుకు చెందిన రాజేంద్ర కుటుంబం, తన సోదరుడి కుటుంబ సభ్యులతో కలసి దేవిపట్టణంలోని మేరిమాత అలయానికి ఆటోలో బయలుదేరారు. బంగారుపేటవద్దకు వచ్చేసరికి వారి ఆటోను హెచ్పిగ్యాస్ లారీ డీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా ఈ దుర్ఘటన పట్ల ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.