జాతీయ వార్తలు

విదేశీ పర్యాటకులకు తాకిని ఈశాన్య ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆందోళనలు బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు పాకాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే తమ దేశ పర్యాటకులకు ట్రావెల్ అడ్వయిజరీని అమెరికా, బ్రిటన్ దేశాలు జారీ చేశాయి. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కూడా సూచించారు. అమెరికా ఒక అడుగు ముందుకు వేసి తమ అధికారుల అసోం పర్యటనలను రద్దు చేసింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు.