అదిలాబాద్

ఈతకు వెళ్లి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూర్, సెప్టెంబర్ 18: సరదాగా పెద్ద వాగులో ఈత కోసం వెళ్లి ప్రాణాలు బలి గొన్న సంఘటన కుమ్రంభీం జిల్లా పెంచికల్ పేట మండలం గొంట్ల పేట లో మంగళవారం జరిగింది. మంగళవారం గొంట్ల పేట గ్రామానికి చెందిన సాధు ఆదిత్య (21) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులతోకలిసి మంగళవారం పెద్ద వాగులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి సాదు ఆదిత్య పెద్ద వాగులోని మడుగులో గల్లంతు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. గల్లంతు అయిన సాధు ఆదిత్య కోసం గ్రామస్తులు పెంచికల్‌పేట పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా గొంట్లపేట పెద్ద వాగులోని సాదు ఆదిత్య శవమై కనిపించాడు. సాధు ఆదిత్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు తల్లిదండ్రులు రాజారాం, సుగుణ రోధిస్తు తెలిపారు. చేతికందిన కుమారుడు ఈతకు వెళ్లి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, పెంచికల్ పేట ఎస్ హెచ్ ఓరఘునాథ్ సర్కార్‌లు సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రఘునాథ్ సర్కార్ తెలిపారు.

కుంటలో పడి వ్యక్తి మృతి
రెబ్బెన, సెప్టెంబర్ 18: రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన ఎరగంటి పోశమల్లు ( 38) మనే్నగూడ గ్రామ సమీపంలో గల చాపిడి కుంటలో పడి మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై దికొండ రమేష్ తెలిపారు. మృతుడు ఉదయం 11:30 కు ఇంట్లో నుండి చేపలు పట్టడానికి చాపిడి కుంటకు వెళ్లడాన్ని ప్రమాదవశాత్తు కుంటలో మునిగి పోయాడని దీనితో ఈత రాన్నందున చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు ఎరగంటి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.