అదిలాబాద్

మంచిర్యాల జిల్లాకు నేడు డిప్యూటీ సీఎం మహమూద్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 24: నేడు జిల్లాకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ పర్యటించనున్నట్లు కలెక్టర్ భారతీ హోళీకేరి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 25న జిల్లాలో ఉదయం 11 గంటలకు చేరుకుంటారని, క్వారీ రోడ్డులోని గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, 11:46 నిమిషాలకు తెరాస పార్టీ నాయకులతో సమావేశమవుతారన్నారు. మధ్యాహ్నాం ముస్లీం మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి అనంతరం బెల్లంపల్లికి వెళ్తారని తెలిపారు. సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో సింగరేణి పట్టాలపై, ముస్లీం నాయకులతో సమావేశమై, అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనచేసి సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయలు దేరుతారని తెలిపారు.