అదిలాబాద్

బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్ స్వరూప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 24: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికైనా మునిమంద స్వరూప సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారంచేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం రూ.కోటి 15లక్షల 38వేలు అభివృద్ధి పనుల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అంతకుముందు వేదమంత్రోచ్చరణాల మధ్య మున్సిపల్ కార్యాలయంలో పండితులు పూజలు చేయగా ఆమె చైర్‌పర్సన్ సీట్లో ఆశీనులయ్యారు. అనంతరం చైర్‌పర్సన్ స్వరూప విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 34వార్డులలో అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంతో ప్రతిఒక్కరి సలహాలు తీసుకుంటూ అధికారులను సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తానని స్వరూప తెలిపారు. అంతేకాకుండా పట్టణంలోని 34 వార్డులను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గోధుమల రాజు, పలువురు కౌన్సిలర్ స్వరూపను పూలమాలలు, శాలువాలు, పుష్ప గుచ్చంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నూనెటి సత్యనారాయణ, కౌన్సిలర్‌లు బైరం సుమలత, లక్ష్మి, కొప్పుల సత్యవతి, రేవెల్లి అరుణశ్రీ, కాంపెల్లి కవిత, రాజేశ్వర్, ఎలిగేటి శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు మునిమంద రమేష్, భీమ శంకర్, తాళ్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.