అదిలాబాద్

ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 13: రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేంధర్‌రెడ్డి వీడీయో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, అదనపు ఎస్సీ దక్షిణామూర్తిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేంధరెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ నెలలో జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన శాంతి భద్రతా చర్యలపై దృశ్య సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలకు అన్నివేళల అందుబాటులో ఉంటూ వారికి చట్టపరమైన సహాయం చేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.