అదిలాబాద్

టీఆర్‌ఎస్‌తోనే సబ్బండ వర్ణాల అభ్యున్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 19: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని టీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలో భాగంగా పాదయాత్రలు నిర్వహించారు. అక్కాపూర్, మేడిపల్లి, భాగ్యనగర్, కొండాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కేసీ ఆర్ చేపట్టిన పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను కోరారు. నిర్మల్ నియోజకవర్గంలో టీ ఆర్ ఎస్ హయాంలో కొట్లాది రూపాయలు వెచ్చించి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది పనులు చేపట్టినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించండని, నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ది చేస్తానని అన్నారు. మరింత అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రజలు మరోసారి టీ ఆర్ ఎస్‌కు పట్టం కట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తూ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో వౌళిక వసతుల కల్పనతో విద్యా, వైద్యానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలను క ల్పించి బంగారు బాటలుగా మార్చామన్నారు. గత ప్రభుత్వాలు చేయనివిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ రైతుబందు, రైతుభీమా వంటి పథకాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వితంతువులకు, వికలాంగులకు, వృద్దులకు ఇస్తున్న పింఛన్‌ను రెట్టింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో యువతుల వివాహాలకు ఆర్థికభారం పడకుండా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో పాటు గొల్లకుర్మలకు సబ్సీడిపై గొర్రెలను అందజేసి వారి ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం కృషిచేసిందన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని, మాయకూటమి మాయమాటలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో మహాకూటమికి ఓటేస్తే తిరిగి ఆంద్రోళ్ల పాలన మొదలవుతుందని వివరించారు. ప్రజల అభివృద్దికి పాటుపడే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి కూటమికి బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్‌రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు నల్లా వెంకట్‌రాంరెడ్డి, డాక్టర్ కె.మల్లికార్జున్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు