అదిలాబాద్

బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర డెయిరీ చైర్మెన్ లోక భూమారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగేళ్లలోనే ఎంతో అభివృద్దిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌పై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. వచ్చే ఐదేళ్ళలో రైతులకు, నిరుపేదలకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తామన్నారు. మెనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటిని అమలు పరుస్తామని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకంటే అభివృద్దిలో ముందుంచేలా సిఎం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచి గెలిపించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు.