అదిలాబాద్

నూతన లక్ష్యాలతో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జనవరి 1: నూతన సంవత్సరంలో నూతన లక్ష్యాలతో పోలీస్ శాఖ ముందుకు సాగాలని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అధికారులకు సూ చించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆవరణంలో పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర సందర్బంగా ఆయన కేక్ కట్‌చేసి, కమిషనరేట్ పరిధిలోని
ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రామగుండం సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కమీషనరేట్ పరిధిలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పోలీసింగ్ నిర్వహించాలన్నారు. సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు. గతేడాది జరిగిన రోడ్లు ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడ్డారని ఇలాంటి పరిస్థితి ఈ ఏడాది ఉండకూడదని గంజాయ్, పిడి ఎస్ రైస్ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నిర్ములిస్తామన్నారు. మహిళ వేధింపులు సహించబోమని తెలిపారు. వేధింపుల నివారణ కోసం షీ టీమ్‌లను కమీషనరేట్ పరిధిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రౌడీ యిజం ఏ రూపంలో ఉన్నా ఉక్కుపాదం తో అణిచి వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి 2019 ప్లాన్ ప్రకారం ఫ్రెండ్లీ పోలీస్ గా ప్రజలతో ఉండాలని, కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు శాంతి యుత , స్వేచ్చ వాతావరణంకి భంగం కలిగించకుండా వాటి పట్ల కఠినంగా ఉండాలన్నారు. రామగుండం కమీషనరేట్ పోలీస్ అధికారులు హోం గార్డు నుండి ఉన్నత అధికారుల వరకు ప్రజలతో మంచి సత్సబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. స్నేహా పూర్వక పోలీస్ విధానాన్ని అవలంభిస్తు కమీషనరేట్ పోలీస్ బాధ్యతయుతంగా, జవాబు దారితనంతో పారదర్శకంగా పని చేస్తు ప్రజల ధన, మాన , ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పని చేయాలన్నారు. ప్రజల భద్రతే ముఖ్య లక్ష్యంగా రామగుండం కమీషనరేట్ పని చేస్తుందని తెలిపారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఆభద్రత భావం లేకుండా పోలీస్ మన కోసం ఉ న్నారనే నమ్మకంతో ఉండేలాగా పోలీసులు కృషి చేయాలని అన్నారు. శాంతి భద్రతలకు, స్వేచ్చకు భంగం కలిగేలా ప్రవర్తించ కూడదని శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని, ఎలాంటి గొడవలు, అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం నెలకొల్పి , నేరాల నియంత్రణే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమీషనరేట్ ఉన్నతాధికారులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోలాహలంగా న్యూ ఇయర్ జోష్..
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 1: గతించిన కాలానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సర ఆరంభానికి స్వాగతం పలుకుతూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం ఉదయం నుండే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాలతో ప్రజలు వేడుకల్లో పాలుపంచుకున్నారు. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజ కార్యక్రమాలతో కిటకిటలాడాయి. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల నివాస గృహాల్లో అభినందనల వెల్లువతో సందడి చేశాయి. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో కలెక్టర్, ఎస్పీలను కలుసుకునేందుకు వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు బారులు తీరారు. ఆదిలాబాద్‌లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న నివాసం వద్ద కార్యకర్తలు హంగామా సృష్టించి అభినందనలతో ముంచెత్తారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆమాంతం పడిపోయి 3 డిగ్రీలకు చేరుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ వినూత్న నిర్ణయం తీసుకొని అందరి మన్ననలు పొందారు. తన వద్దకు పుష్పగుచ్చాలు, శాలువాలతో రావద్దని, కొత్త సంవత్సరం వేళ నిరుపేదలకు అత్యవసరంగా భావించే రగ్గులు, బ్లాంకెట్లను వెంట తీసుకరావాలని సూచించారు. ఇందుకు స్పందించిన అధికారగణం, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవర్గాలు భారీ ఎత్తున రగ్గులు తీసుకవచ్చి కలెక్టర్‌కు అందించడంతో వాటిని అప్యాయంగా స్వీకరించిన కలెక్టర్ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఒక్కరోజే కలెక్టర్‌ను కలిసి రగ్గులు పంపిణీ చేయడంలో కలెక్టర్ నివాసగృహంలోని ఓ గది నిండా నూలు దుస్తువులు, రగ్గులతో నిండిపోయింది. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, డి ఎస్పీ నర్సింహారెడ్డి అధ్వర్యంలో పోలీసు అధికారులు ఉదయమే కలెక్టర్ దివ్యను కలిసి అభినందనలతో ముంచెత్తారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులతో పాటు కాంగ్రెస్ నాయకులు సుజాత, సోయం బాపురావుప్రత్యేకంగా కలెక్టర్‌ను కలిసి కొత్త సంవత్సరం వేళ శుభాకాంక్షలు తెలిపారు. టీయూడబ్ల్యుజె అధ్వర్యంలో చలి తీవ్రత నేపథ్యంలో సామాజిక బాధ్యతగా జర్నలిస్టులు సైతం భారీ ఎత్తున దుప్పట్లు, రగ్గులు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం చుట్టారు.