అదిలాబాద్

కొత్త పంచాయతీల్లో ఏకగ్రీవ సర్పంచ్ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జనవరి 4: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉట్నూరు మండలంలో 35 గ్రామపంచాయతీలు ఉండగా కొత్తగా ఏర్పాటైనా కామాయిపేట పంచాయతీ సర్పంచ్‌గా ఆత్రం అయ్యూబాయిని గిరిజనులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం కామాయిపేటలో పంచాయతీ పరిధిలోని అల్లీగూడ, కామాయిపేట, పాటగూడ, మత్తడిగూడ, బొప్పరికుంట, బొగ్గుగుట్ట, ఒంటిమామిడి గ్రామాలకు చెందిన గిరిజనులు సమావేశమయ్యారు. చాకటి రాజు పటేల్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించగా కొత్తపంచాయతీ మహిళలకు రిజర్వ్ అయినందునా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తీర్మానం చేశారు. ఈమేరకు కామాయిపేటకు చెందిన ఆత్రం అయ్యూబాయిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని తిర్మానించగా వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం మడావి భీంరావును ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలని తీర్మానించారు. సమావేశంలో గిరిజన పెద్దలు మడావి జలపతిరావ్, కుర్సంగెదేవు, ఆత్రం సోనెరావు, భూమారావు, భీంరావు, మహిళా సంఘాల ప్రతినిధులు సోనిబాయి, సోంబాయి, చిన్నుబాయి తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణ పతక విజేతకు ఘన స్వాగతం
కాగజ్‌నగర్, జనవరి 4: ఇండో నేపాల్ అథ్లెటిక్స్ ఛాంఫియన్ షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారిణి ఉమా సర్కార్‌కు శుక్రవారం కాగజ్‌నగర్‌లో బీజేపీ నాయకురాలు కొత్తపల్లి వెంకటలక్ష్మి, చంద్రయ్య , స్వచ్చంద సేవ సమితి అధ్యక్షురాలు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం పలికారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలానికి చెందిన ఉమా సర్కార్ ఇండో నేపాల్ ఛాంఫియన్ షిప్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, అదే విధంగా షార్ట్ ఫుట్‌లో సైతం స్వర్ణ పతకం గెలుచుకొని శుక్రవారం కాగజ్‌నగర్ కు చేరుకుంది. ఈ సందర్బంగా క్రీడాకారిణి మాట్లాడుతూ తాను అంతదూరం పోటీలో పాల్గొనడానికి వెళ్లేందుకు సహాకరించిన కొత్తపల్లి వెంకటలక్ష్మి, చంద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు అనీత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ అనీత క్రీడాకారిణి కి శాలువా కప్పి అభినందించారు. క్రీడాకారులు ఎవరైనా సహాకారం కావాలంటే తాము అందిస్తామని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు.

కుల వృత్తులతో యువతకు ఉపాధి
* జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజేశ్వర్
ఆసిఫాబాద్ టౌన్, జనవరి 4: కులవృత్తులలో నైపుణ్యం సాధించిన యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్ పద్మశాలి భవనంలో కుమ్మరి కులస్తులకు నైపుణ్యం పెంచేందుకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులను జనవరి 7 నుండి 9 వరకు నిర్వహించడం జరగుతుందన్నారు. ఈ శిక్షణ సందర్భంగా ఇండ్లలో వాడే అలంకరణ సామాగ్రి, వాటర్ బాటిళ్లు, గ్లాసులు, జగ్గులు, టీ కప్స్ తయారీ పై శిక్షణ ఇవ్వడం జరగుతుందని ఆయన తెలిపారు. కుమ్రంభీం జిల్లాలోని కుమ్మరి కులస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి ముగ్గురు చొప్పున 30మందికి మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుందని రాజేశ్వర్ తెలిపారు. ఆసక్తి గల వారు తమ ఫోటో, ఆధార్ కార్డు, కుల సర్ట్ఫికేట్లతో హాజరుకావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన తరగతులు అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేయడం జరగుతోందన్నారు. వీటిని కులవృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కుమ్మరులు కేవలం కుండల తయారీకే పరిమితం కాకుండా అనేక మట్టి వస్తువుల తయారీలో శిక్షణ ఇచ్చి మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న వస్తువుల తయారు చేయడం ద్వారా ఆర్థిక పుష్టి సాధించే దిశగా వారిని సమాయత్తం చేస్తున్నామన్నారు.

రాష్ట్ర పథకాలకు అంతర్జాతీయ గుర్తింపు
* సీఎం కేసీఆర్ నిర్ణయాలు చారిత్రాత్మకం
* ఎన్నికల తర్వాత పంచాయతీల రూపురేఖలు మారుస్తాం
* జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపు
* ఏకగ్రీవ పంచాయతీలకు పెద్దపీఠ
* నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, జనవరి 4: తొలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం ఈ రాష్ట్ర ప్రజల విజయమని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించిన సంగతి అందరికి తెలిసిందేనన్నారు. ఈ పథకాల అమలుకోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారని, దేశ ప్రధాని సైతం రైతుబంధు అమలుకు కార్యాచరణ రూపొందిస్తుండడం పట్ల ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. శుక్రవారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ పేద ప్రజలు, రైతుల సంక్షేమం కోసం అమలుచేసిన పథకాలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయన్నారు. ఇలా ఉంటే త్వరలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయని, అనంతరం గ్రామాల రూపురేఖలే మారిపోనున్నాయన్నారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీ ఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం పెద్ద ఎత్తున నిధులను మంజూరుచేసి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 134 పంచాయతీల్లో కనీసం 30 శాతం అయినా ఏకగ్రీవం చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.10 లక్షల నిధులు విడుదలవుతాయని, అలాగే ఎన్ ఆర్ ఈజీయస్ ద్వారా మరో 10 లక్షలు ఇప్పిస్తానని ఆయన హామీనిచ్చారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే రూ.20 లక్షల నిధులతో గ్రామాన్ని అభివృద్ది చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
పార్టీ పునర్ నిర్మాణం కోసం....
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించడంతో ఆయన ఆదేశం ప్రకారం పార్టీని కిందిస్థాయి నుండి పునర్‌నిర్మాణం చేసేందుకు కార్యాచరణ రూపొందింస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాకో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించినందున నిర్మల్ జిల్లాలో దాదాపు ఎకరం స్థలంలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలకు అనువుగా ఉండేవిధంగా ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దేవరకోట ఆలయ చైర్మెన్ ఆమెడ కిషన్, పార్టీ నాయకులు గండ్రత్ ఈశ్వర్, ధర్మాజి రాజేంధర్, కోటగిరి అశోక్, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, ద్యాయత్ సోమేశ్వర్, మేడారం ప్రదీప్, గండ్రత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

శిర్షా పంచాయతీ
ఏకగ్రీవానికి తీర్మాణం
* సర్పంచ్, ఉప సర్పంచ్‌ల పేర్లు ఖరారు
* జిల్లాలోనే తొలి ఏకగ్రీవం
కౌటాల, జనవరి 4: పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియకు ముందే సర్పంచ్, ఉప సర్పంచ్‌ను ఖరారు చేసి తీర్మాణం చేసి మండలంలోని శిర్షా గ్రామానికి చెందిన ప్రజలు తమ ఐక్యతను చాటారు. దీనికి సంబంధించి వివరాలలోకివెళ్లితే పంచాయతీల పునర్విభజనకు ముందు మండలంలోని ముత్యంపేట పంచాయతీలో శిర్షా గ్రామం ఉండేది. ఈ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయడంతో తొలిసారిగా ఎన్నికలు జరుగుతుందటంతో సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో సహా ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాధారణ పంచాయతీ ఎన్నికలలో ఎన్నిక జరగాల్సి ఉండగా అటు అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్న దరిమిలా గ్రామస్థులంతా ఏకమై గురువారం రాత్రి సమావేశమై సర్పంచ్, ఉప సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఖరారు చేసి తీర్మాణాన్ని కూడా రాసుకున్నారు. అసలే రాజకీయాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గ్రామ పంచాయతీల పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితులు నెలకొనగా కొత్తగా ఏర్పడిన శిర్షా గ్రామస్తులు అభివృద్ధిని ఆకాంక్షిస్తు ఏకగ్రీవంగా తమ గ్రామ ప్రథమ పౌరురాలును ఎన్నుకోవడం విశేషం. సర్పంచ్ పదవిని బీసీ(మహిళ)గా రిజర్వు చేయడంతో 658 ఓటర్లున్న గ్రామంలో 100శాతం బీసీ ఓటర్లే ఉండగా, వీరిలో కుర్మ కులస్తులు 90 శాతం వరకు ఉండటం విశేషం. సర్పంచ్‌గా కడారి కనుకక్కను మొట్టమొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. ఈ మేరకు గ్రామస్థులు ఆమె పేరును ఖరారు చేస్తూ ఏకగ్రీవ తీర్మాణాన్ని రాసుకున్నారు. గ్రామంలో ఎటువంటి విభేదాలు ఉండకూడదనే వారు ఐక్యతను చాటేందుకు ఏకగ్రీవం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటే ఉప సర్పంచ్‌గా దివ్యాంగురాలైన ఎగ్గే తిరుపతమ్మను ఖరారు చేశారు. 8 వార్డులకు గాను వార్డు సభ్యలను కూడా త్వరలోనే ఏకగ్రీవంగా ప్రకటిస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఫోటోరైటప్
4 ఎం ఎన్‌సిపి 13: శిర్షా పంచాయతీ సర్పంచ్‌గా తీర్మాణించిన కనుకక్క
4 ఎం ఎన్‌సిపి 14: కౌటాల మండలంలోని శిర్షా గ్రామం

ట్రాయి నిబంధనలతో సామాన్యడిపై పెనుభారం
బ్రైట్‌వే ఎండి ఎఫ్‌టీఏ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి
శ్రీరాంపూర్ రూరల్ జనవరి 4: ట్రాయి నిబంధనలతో సామాన్యుడుకి వినోదం దూరమయ్యే ప్రమాదం ఉందని ట్రాయి నిభందనలను పునఃరాలోచించాలని బ్రైట్‌వే ఎండి ఎఫ్‌టీఏ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలోని సింగరేణి సేవ భవన్‌లో ఉమ్మడి అదిలాబాద్ కేబుల్ ఆపరేటర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ టీ ఎం అధ్యక్షులు సుభాష్‌రెడ్డి, విక్రమ్ డిజిటల్ కేబుల్ నెట్‌వర్క్ అధినేత అధ్యక్షులు బ్రింజ్‌మోహన్ శర్మ, బ్రైట్‌వే డైరెక్టర్, హైటెక్ కమ్యూనికేషన్ అధినేత మహ్మద్ వౌలానాలతోకలసి మాట్లాడారు.కేబుల్ టీవీ బిజినెస్‌కు ఎలాంటి ఇబ్పంది లేదని, మొబైల్ టెక్నాలజీని ఉపమోగించుకొని కొత్త చానళ్లను ఎప్పటికప్పుడు వినయోగదారునికి అందుబాటులో ఉంచాలని తెలిపారు. వద్దనకున్న వినియోగదారునికి వెంటనే క్యాన్సిల్ చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా కోటి కేబుల్ కనెక్షన్లు ఉన్నాయని, ఒక్క పే చానల్‌కు రుపాయి చెల్లించిన కోటి రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ట్రాయి నింబంధనల ప్రకారం ఒక చానల్‌కు పది పైసలు నుండి 19రూపాయల లోపు వసూల్ చేసే అవకాశం కల్పించారని తెలిపారు.దీనికి ప్రతి చానల్‌కు రూ 19 చోప్పున వాసుల్ చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కేబుల్ రంగంపై విధించిన జీఎస్‌టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలనీ కోరామన్నారు.కేబుల్ ఆపరేటర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు.నామాన్యుడి పై భారం పడే విధంగా ఉన్న ట్రాయ్‌నిబందలను తొలగించాలని రూ. 130 ఏయిర్ టూ ఫ్రీ చానల్స్ బిల్లును కేబుల్ ఆపరేటర్లకు వర్తించేలా చేయాలని అన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఐక్య మత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఉమ్మడి అదిలాబాద్ ఎంఎస్‌వోలు మందమర్రి సధానందం, చెట్ల రమేష్ లక్షేట్ పేట్, అజయ్ బెల్లంపల్లి, మురళి బెల్లంపల్లి రూరల్, సతీష్ రామకృష్ణపూర్ జాకీర్ రామకృష్ణాపూర్, శ్రీనివాస్,మ్యదరిపేట పాలకుర్తి శ్రీనివాస్,కడెం, మధు జన్నారం,మదాసు మధుచెన్నూర్,ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షులు బొద్దున సత్తయ్య,కార్యదర్శిరాజేశం,సిటి డిజిటల్ డైరెక్టర్ పంబాల తిరుపతిలతో పాటు వివిధ ఏరియాల ఆపరేటర్స్ తదితరు లు పాల్గొన్నారు.