అదిలాబాద్

రెండో విడతకు పోటాపోటీ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 11: తొలి విడత నామినేషన్ల ఘట్టం పరిసమాప్తం కావడంతో అధికార యంత్రాంగం ఈనెల 25న జరిగే రెండో విడత ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు గావిస్తున్నారు. ఆసిఫాబాద్ కుమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఇది వరకే పోలీసు శాఖ గుర్తించి బందోబస్తుకు ఏర్పాట్లు గావిస్తుండగా ఎన్నికల యంత్రాంగం సైతం ప్రశాంతంగా పంచాయతీలు, తాండాలు, గూడేల్లో పోలింగ్ జరిగేలా కసరత్తుసాగిస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రెండో విడతగా 489 గ్రామపంచాయతీలు, 4174 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా శుక్రవారం నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండో విడత నామినేషన్ల ఘట్టంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇది వరకే తొలివిడత నామినేషన్ల ఘట్టం అనంతరం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన 80 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం కానున్నారు. కొన్ని చోట్ల బరిలో దిగిన అభ్యర్థులను రంగం నుండి తప్పించేందుకు బడా నేతలు, పలుకుబడి ఉన్న నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గూడేల్లో, తాండాల్లో ఏకగ్రీవాల కోసం ఆయా పార్టీల నాయకులు మంతనాలు సాగిస్తుండడం గమనార్హం. సర్పంచ్ కొలవులపై మోజు పెంచుకున్న యువతరం పోటాపోటీగా నామినేషన్లకు సిద్దమవుతుండగా పల్లెపోరులో పట్టు నిలుపుకునేందుకు రాజకీయ పార్టీలు సైతం పావులు కదుపుతున్నాయి. సామాజిక వర్గాలను బేరీజు వేసుకుంటూనే గ్రామాల్లో పట్టున్న నేతలను ఎన్నికల బరిలో దించేలా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. టీ ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇప్పటికే జాబితాలను తమ వద్ద ఉంచుకొని వర్గ సమీకరణతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రంగం సిద్దం చేశారు. జనరల్, బీసీ స్థానాల్లో పోటీ అధికంగా ఉండడంతో ఓట్ల చీలిక ప్రభావంతో ఓటమి పాలవుతామన్న భయం కూడా నేతలను పట్టిపీడిస్తోంది. దీంతో సర్పంచ్ అభ్యర్థితో పాటు ఆయన శిబిరానికి చెందిన వార్డు స్థానాల అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో సంస్థాగతంగా పట్టునిలుపుకునేలా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ప్రచారానికి తెరలేపుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 149 పంచాయతీల్లో నామినేషన్ల జోరు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1503 గ్రామపంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు గావిస్తుండగా వీటిలో రెండో విడతలోనే 489 గ్రామపంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతగా జరిగే ఎన్నికల్లో భాగంగా బజార్‌హత్నూర్, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ, తలమడుగు మండలాల్లో 33 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 149 పంచాయతీలు, 1208 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, మంచిర్యాల జిల్లాలోని బీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని 102 పంచాయతీలు, 868 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా నిర్మల్ జిల్లాలోని మామడ, కడెం, దస్తూరాబాద్, లక్ష్మణాచాంద, ఖానాపూర్, పెంబి మండలాల్లోని 39 క్లస్టర్ల పరిధిలో 131 పంచాయతీలు, 1170 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో 107 పంచాయతీలు, 928 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన, సమస్యాత్మకమైన పల్లెలు కావడంతో ఇక్కడ పోలీసు యంత్రాంగం పకడ్బందీ బందోబస్తుకు సన్నాహాలు సాగిస్తోంది. రెండో విడత ఎన్నికల కోసం ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని క్లస్టర్లకు తరలించగా శుక్రవారం నుండి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15న అభ్యంతరాలకు అవకాశం కల్పించి, 17న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడవు ఇచ్చి అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

అంగరంగ వైభవంగా కుడారై మహోత్సవం
దివ్యనగర్,జనవరి 11: నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రంలో గల మల్లన్నగుట్టపై గల రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో హైదరాబాద్ రమణచార్యుల వేద మంత్రాలతో గోదారంగనాథుల కుడారై ఉత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా 108 వెండి, ఇత్తడి గంగాళాలతో నైవేద్యం నివేదించారు. ఇందులో భాగంగా స్వామివారికి నివేదించిన వెండి గంగాళాన్ని వేలం వేయగా రూ.16500కు పద్మజా రామారావులు కొనుగోలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతోపాటు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద, మురళీధర్‌రెడ్డి, ఆలయ గురుస్వామి, టీ ఎన్ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్‌రెడ్డి, గురు స్వాములు శంకర్, సతీష్‌రెడ్డి, ఎమ్మెల్యే అల్లోల సతీమణి విజయమ్మ, విమలమ్మ, మాధవమ్మ, శ్యామలమ్మ, అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి-
5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు పడేలా చూడాలి-
డబ్ల్యు హెచ్ ఓ ప్రతినిధి అతుల్ పండరినాథ్-
ఆసిఫాబాద్ టౌన్, జనవరి 11: జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 3 న నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డబ్ల్యుహెచ్ ఓ ప్రతినిధి అతుల్ పండరినాథ్ అన్నారు. శుక్రవారం జిల్లా వైధ్యాధికారి కార్యాలయం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పిహెచ్‌సి వైద్యులు , సూపర్‌వైజర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని 5సంత్సరాలలోపు పిల్లలందరకి పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ సీతారాం , జిల్లాలోని పిహెచ్‌సి వైద్యాధికారులు , సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

చలి చలి....
దహెగాం, జనవరి 11: శుక్రవారం ఉదయం నుండి మబ్బులు కమ్ముకొని ఉండటంతో పాటు కొంత మేర చలి కూడా ఉంది. చలి కూడా ఉండటంతో కళాశాలకు చేరుకున్న విద్యార్థులు చలి మంటలు వేసుకొని మంటల నుండి వెచ్చదనం పోందారు. వివధ గ్రామాల నుండి దహెగాం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమయానికి చేరుకున్నారు. ఉదయం నుండి సూరీడు బయటకు రాక పోగా మబ్బులు ఉండటంతో 9 డిగ్రీల చలి తీవ్రత ఉంది. దీనితో 10:30 అయిన తరగతులకు వెళ్లలేక చలి మంటల నుండి విద్యార్థులు ఉపశమనం పోందారు.

కేఆర్‌కే కాలనీలో కో ఆపరేటివ్ బ్యాంకు ప్రారంభం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జనవరి 11: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గల కెఆర్‌కె కాలనీలో శుక్రవారం కో-ఆపరేటీవ్ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీటీసీ విజ్జగిరి అశోక్, మావల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుపతి ప్రారంభించారు. అనంతరం బ్యాంకులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాంకును ఏర్పాటు చేసినందుకు గాను డిసిసిబి చైర్మెన్ దామోదర్‌ను శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సంధర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి దూరంగా ఉన్న కెఆర్‌కె కాలనీ వాసుల సౌకర్యార్థం ఈ బ్యాంకు సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. బ్యాంకు సేవలను కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

11 ఎన్ ఆర్ ఎంపి 5: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
నామినేషన్ ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ ప్రశాంతి
నిర్మల్, జనవరి 11: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. శుక్రవారం నిర్మల్ మండలలోని చిట్యాల్ గ్రామంలోని నామినేషన్ కేంద్రంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ప్రతీరోజు ఆన్‌లైన్‌లో నామినేషన్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జనవరి 11: జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విష్ణు ఎస్ వారియర్‌తో పాటు జిల్లా అధికారులు, ఎంపిడీవోలు, రవాణా శాఖ అధికారులతో కలిసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా సమస్యాత్మక మారుమూల పంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రూట్లవారీగా వాహనాలను సమకూర్చుకోవాలని, ఎన్నికల సిబ్బందికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైన సమస్య ఎదురైతే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. అధికారులు వెనువెంటనే సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని సూచించారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎంపిడీవోలు, అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ సిఈవో జితెందర్ రెడ్డి, డిఎస్పీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోలీసులు ప్రజలకు సేవకులుగా పని చేయాలి
* సీపీ సత్యనారాయణ
మందమర్రి, జనవరి 11: పోలీసులు విధి నిర్వహాణలో ప్రజలకు సేవకులుగా పని చేయాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సంస్కరణలకు సంబంధించి పోలీసింగ్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రాంతం ఒకే సేవ అనే నినాదంతో రాష్ట్రం అంతటా పోలీసులు విధులు నిర్వహించాలని డిజిపి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విధి నిర్వహాణలో ప్రజలతో మమ్మేకం అయి దళిత, కుల ఖేధం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. ప్రజలనుండి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అన్ని విదాల సహాకారం అందిస్తుందని దానికి ప్రతిఫలంగా పోలీసులు విజయవంతం విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పోందుతున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా పోలీసులు సాంకేతిక సేవలు వినియోగించుకోవాలని దాని వల్లనే నేరాలను అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో సాంకేతిక సేవలు వినియోగించుకొని అనేక నేరాలను అదుపు చేయడం జరిగిందని ముఖ్యంగా మర్డర్, చైన్ స్నాచీంగ్ లాంటి కేసులను సిసి కెమెరాల ద్వారా కనిపెట్టి వెంటనే కేసులు చేధించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. రామగుండం కమీషనరేట్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ కమీషనరేట్ గా రూపు దిద్దేందుకు పోలీసులు సహాకరించాలని ఆయన కోరారు. రామగుండంలో తాను విధులు నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇక్కడి ప్రజలు అమాయకులు అని ఆయన కొనియాడారు. రామగుండం కమీషనరేట్ పరిధిలో గంజాయ్ వాడకం పెరిగి చాలా మంది గంజాయ్‌కు బానిసలు అవుతున్నారని, ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేయడంజ రిగిందని ఇంకా 17 మందిని గుర్తించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గంజాయ్ వాడిన, సరఫరా చేసిన , మొక్కలు పెంచిన వారిపై పిడి యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పోలీసులు ఎలాంటి బేషజాలకు పోకుండా నిర్బయంగా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి వేణుగోపాల్ రావు, బెల్లంపల్లి ఏసిపి బాలు జాదవ్, మందమర్రి సి ఐ రాం చందర్ రావు, ఎస్సై శివకుమార్‌తో పాటు ఆర్కేపి, దేవాపూర్, కాసిపేట ఎస్సై లు , కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

పెర్కపల్లి సర్పంచ్ పదవికి రూ.6.35 లక్షలకు వేలం?
* వేలంపాటకు సహకరించని వ్యక్తికి గ్రామ బహిష్కరణకు తీర్మాణం
* గ్రామపెద్దల నిర్ణయంపై అభ్యర్థి భూమన్న అధికారులకు ఫిర్యాదు
కడెం, జనవరి 11: దస్తురాబాద్ మండలంలోని పెరుకపల్లి గ్రామంలో ఈనెల 10న కొందరు గ్రామ పెద్దలు, గ్రామస్థులు కలిసి పెరుకపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి వేలం వేశారని, ఈవేలంలో గ్రామానికి చెందిన ఎ.ప్రభాకర్ అనే వ్యక్తి రూ.6లక్షల 35 వేలకు వేలం పాడారని పాండ్వాపూర్ సింగిల్ విండో చైర్మెన్, పెరుకపల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో ఉన్న అభ్యర్థి చుంచు భూమన్న ఆరోపించారు. శుక్రవార మండల కేంద్రమైన కడెంలో విలేఖర్ల సమావేశంలో భూమన్న మాట్లాడుతూ దస్తురాబాద్ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పెరుకపల్లి సర్పంచ్ పదవికి పోటీలో గ్రామానికి చెందిన సి.హెచ్ భూమన్న, అప్పని ప్రభాకర్, గడికొప్పుల శంకరయ్య, అప్పని రాజు ఉండి నామినేషన్లు వేశారు. కాగా. ఈనెల 10వ తేదిన పోటీలో ముగ్గురు అభ్యర్థులు గ్రామపెద్దలు, గ్రామస్థులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ పదవిని వేలంపాటను నిర్వహించి ఎ.ప్రభాకర్ అనే వ్యక్తికి రూ.6.35 లక్షలకు సర్పంచ్ పదవినీ కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వేలం పాటలో తాము లేమన్నారు. అలాగే తమకు ప్రతిపాదించిన వ్యక్తులను ఉపసంహరించుకోవాలని వారికి బెదిరిస్తున్నారన్నారు. వేలానికి వ్యతిరేకంగా కొంతమంది తమను బెదిరింపులకు గురిచేస్తున్నా తాము పోటీలోనే ఉన్నామన్నారు. ప్రజల ఓట్లతో గెలవాలికానీ వేలం ద్వారా కాదని అంటూ తాము పోటీలో ఉన్నామని, తమవెంట ఎవరు ప్రచారం చేయవద్దని, ఇంటికి ఎవరు కూడా పోవద్దని ఎన్నికల్లో తమకు సహరించవద్దని గ్రామపెద్దలు, మరికొంత మంది నాయకులు తమపై తీర్మాణం చేశారన్నారు. తమను గ్రామం నుండి వేలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారన్నారు. ఎన్నికల బరిలో తమదే గెలుపు అంటూ తాము విస్తృత ప్రచారం చేసుకుంటున్నామని అభ్యర్థిగా తమకు రక్షణ కల్పించాలని అధికారులకు ఫిర్యాదుచేయనున్నట్లు భూమన్న పేర్కొన్నారు.