అక్షర

కవిత్వం నాగాస్త్రం.. వర్తమాన వక్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయపడ్డ గుండె భాష
-శ్రీనాగాస్త్ర
పేజీలు: 132
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
కృష్ణాపురం
టి.నర్సాపురం (పోస్ట్)
ప.గో.జిల్లా -534 467
9640317108
*
‘అక్షరాయుధులు కవులు - క్రాంతిదర్శులు’ అన్నది వర్తమాన వాస్తవం. అందుకే తన గాయపడ్డ గుండె భాషను అక్షరాల్లో సంధిస్తున్న కవి నాగాస్త్ర. ఇక కవిత్వం ఒక సమాజ చోదక శక్తిగా నిలబడటం, గుర్తింపు పొందటం అంత సాధారణ విషయం కాదు. దానికి జ్వలన జీవనం అవసరపడుతుంది.
నేను కవిని/ ప్రజా గుండెల్లో అస్తమించని సూర్యుణ్ణి/ ధరిత్రి నలుదిక్కులా మోగుతున్న చైతన్య భేరిని/ అక్షరమే నా ఆయుధం/ అక్షరమే నా కీర్తి ధ్వజం’ ఇది ఒక సందేశాత్మక ఆశయంగా ప్రకటించుకున్నాడు. అలాగే ‘ఓ కవి సార్వభౌమా’ శీర్షికలో కవుల్ని ఆత్మవిమర్శన ఆత్మాభిమానం, అస్తిత్వం నిలుపుకోవాలన్న సందేశం ఉన్నది. అవార్డులు, కులగజ్జి, కీర్తికండూతులు, పాలకుల పెంపుడు కుక్కల్లా బతకడం కాదు, పోతన్నలా బతుకు అనడం ఔచిత్యం కవి కులంపై ఎక్కుపెట్టిన అస్తమ్రే కదా. ఇలాంటి అస్త్ర శస్త్రాలు నాగాస్త్ర మరిన్ని అంశాలుగా కొన్ని శీర్షికలో - తన అభివ్యక్తిని, అలతి పదాల్తో అక్షరీకరించారు. ‘రైతు’ను జీవిత పుట్టిని, కాలంచేసే కరువు కనె్నర్రల్నించి, పుట్టెడు దుఃఖాల్ని గుండెల్లో దాచుకున్నాడంటారు. ఆరుగాలంనేకాక/ కిసానంతే/ మేడి వదలడు/ వ్యవసాయం మానడు/ పట్టు వదలని విక్రమార్కుడు.. అంటున్నాడు.
ఈ క్రమంలోనే ములుగర్ర చేతబట్టినా, దళారిస్వామ్యం గిట్టుబాటు ధరలు పొందలేనప్పటి దైన్యం, అప్పుల ఊబిలో కూరుకున్నప్పటి హైన్యం తెలుపుతూ ‘దుక్కులు దున్నాల్సిందే’ శీర్షికని ‘ఆరుగాలం పడ్డ కష్టానికి/ పొలం బంగారు కంకుల్ని ఈనింది... ధాన్యపు కంకుల్లోని ప్రతి గింజపైన రైతన్న పేరే రాసి ఉంది/ అన్నప్పుడు ఆ కలలు సాకారం కావటం లేదన్నప్పుడు.../ వడ్లగింజలపై దళారి పేరు మెరియడం చూసినప్పుడు/ లాభం లేదు/ కలుగుల్లో పొగ ఊదాల్సిందే/ గిడ్డంగుల్లో బోన్లు పెట్టాల్సిందే.. అన్న ఆత్మ దమనశక్తిని అక్షరాలా చైతన్యంగా తెలిపారు కవి.
‘చేరాగం’ శీర్షికల్లోంచి బిగించిన పిడికిలి వేళ్లు ఐదింటికీ తను కల్పించిన అర్థాన్ని కవిత్వీకరించారు. బొటనవేలు - దొంగ ఓటు, చూపుడు వేలు - మేధోచిహ్నం, మధ్యవేలు - కులం పుండు, స్వేచ్ఛా వ్యాపారికి తాకట్లుగా ఉంగరం వేలుని, చిటికెన వేలు మూఢ భక్తిని సూచిస్తే, పిడికిలిని మాత్రం శ్రమజీవుల సంకేతంగా, దోపిడీకి తిరుగుబాటుగా అభివ్యక్తి వినూత్నంగా ఆలోచింపజేస్తుంది.
అలాగే వివాహ వ్యవస్థలోని ‘మూడు ముళ్లు’ ‘తులసి’ ‘మా అమ్మ’ ‘అమ్మ మమీ అయింది’ శీర్షికలు స్ర్తిత్వపు ఔన్నత్యాన్ని చాటేలా, హృద్యంగా ఆవిష్కరించారు కవి. వర్తమానపు అద్దె గర్భాల గురించి వ్రాసిన వాక్యాలు ప్రతి వారినీ కలచివేసేట్లుగా తమ్ము తాము ప్రశ్నించుకునేలా ‘అమ్మతనం - అమ్మకపు సరుకుగా - ప్రయోగశాలల్లో ఉరి తీయబడింది’ అన్న సంవేదన వర్తమానానికి అన్వయం చేయడం గమనించవచ్చు.
54 కవితలు ఇలా శీర్షికల్లోని ఎత్తుగడలన్నీ వైవిధ్యంగా ‘ముందు మాటలు/ మరమ్మతులు/ జాతి రత్నాలు’ ‘ప్రశ్నలు అనేకం సమాధానం ఒక్కటే’ నిత్య సత్యాల్ని తన అధ్యయనంతో జ్ఞాన సాగరుడవడానికి తన కవితా జ్ఞానాన్ని ఫలంగా అందించిన ప్రయత్న పథికుడు - రాబోయే కాలం సంపుటాల్లో తన ముద్రను బలంగా వేయాలని ఆకాంక్షిద్దాం.

-వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు