జాతీయ వార్తలు
భారత తీరానికి అలల తాకిడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 April 2018
చెన్నై: ప్రత్యేకమైన అలల తాకిడి, ప్రచండమైన గాలుల కారణంగా సముద్ర తీరంలో అలల తాకిడి తీవ్రంగా ఉంటుందని సునామీ హెచ్చరికల సంస్థ ఇన్కాయిస్ వెల్లడించింది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు అలల తాకిడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. భారత తూర్పు తీరంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, పశ్చిమబెంగాల్ సముద్ర తీర ప్రాంతంలోని అలలు అల్లకల్లోలంగా ఉంటాయని, సముద్ర స్నానాలకు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఇన్కాయిస్ వెల్లడించింది. కాగా ఇప్పటిటే కేరళలో అలలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. అలల కారణంగా వంద ఇళ్లు కొట్టుకుపోయాయి.