జాతీయ వార్తలు

70కి చేరిన కల్తీమద్యం మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: అస్సాంలోని గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో కల్తీమద్యం మృతుల సంఖ్య 70కి పైగా పెరిగింది. టీ ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులకు వారానికి ఒక్కసారి కూలీ డబ్బులు ఇస్తారు. గోలాఘాట్ జిల్లాలోని సల్మోరా టీ ఎస్టేట్ వద్ద, టీటాబోర్ సబ్ డివిజన్‌లోని మారుమూల గ్రామంలో కల్తీమద్యం సేవించి మృతిచెందారు. గురువారం రాత్రి వందమంది కార్మికులు మద్యం సేవించారు. వీరిలో 15 మంది మహిళలతో సహా 33 మంది చనిపోగా శనివారంనాటికి ఈ మృతుల సంఖ్య 70కి పెరిగింది. కాగా ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈఘటనపై ఎక్సైజ్ శాఖ విచారణ ప్రారంభించినట్లు గోలాఘాట్ డీఎస్పీ వెల్లడించారు.