జాతీయ వార్తలు

తమిళనాడులో హై అలెర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీలంక తీరం నుంచి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు ప్రవేశించారని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారని, వీరు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై, తమిళనాడు, కొయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. హోటల్స్, థియేటర్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌తో పాటు ఆధ్యాత్మికప్రదేశాలలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.