అనంతపురం

ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం : మంత్రి పల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కపట్నం, ఏప్రిల్ 10: ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బుక్కపట్నంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపనలు చేశారు. రూ.55 లక్షలతో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే రూ.20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా శివాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో మంత్రి పల్లె మాట్లాడుతూ రైతుల పాలిట చంద్రబాబు ఓ వరమన్నారు. అటు వంద సంవత్సరాలు, ఇటు వంద సంవత్సరాలు చూసినా రైతులకు ఇంత పెద్ద ఎత్తున రుణ మాఫీ చేసిన ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబేనన్నారు. రైతుల కోసం ఎన్నో నూతన విధానాలను అమలుచేస్తున్నారన్నారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా హంద్రీ నీవాను పూర్తి చేస్తామన్నారు. పట్టిసీమను పూర్తి చేసి ప్రజలలో ఒక నమ్మకం తెచ్చారని అదే స్ఫూర్తితో హంద్రీ నీవాను పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యశోదమ్మ, ఎంపిటిసి లక్ష్మిదేవమ్మ, నాయకులు వెంకటనారాయణరెడ్డి, పెదరాసు సుబ్రమణ్యం, ఎర్రగడ్డల నాగభూషణ, సుబ్బారెడ్డి, రామకృష్ణ, మంజునాథ్, కృష్ణాపురం గంగాధర్, జనార్థన్, శ్రీరాములు, చెన్నకేశవులు, కిష్టన్న, వెంకటేష్ పాల్గొన్నారు.