క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనం బోల్తా.. విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, ఆగస్టు 29 : మండలపరిధిలోని కొడపగానిపల్లి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం బోల్తా పడి పీజీ విద్యార్థి దుర్మరణం చెందాడు. కొత్తచెరువు నుంచి స్వగ్రామమైన రేగాటిపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సాకే సురేష్ (25) రోడ్డుపక్కన ఉన్న మట్టికుప్పపైకి ద్విచక్రవాహనం వెళ్లడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియగానే ఎస్‌ఐ రాజేష్ సంఘటనాస్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పెనుగొండకు తరలించారు.
మిద్దెపై నుంచి పడి బేల్దారి మృతి
నల్లమాడ, ఆగస్టు 29 : మండల పరిధిలోని ఎద్దులవాండ్లపల్లి తండాలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి బేల్దారి మంగేనాయక్ (42) మృతి చెందాడు. ఓబుళదేవరచెరువు మండలంలోని శేశయ్యగారిపల్లి తండాకు చెందిన బేల్దారి మంగేనాయక్ ఎద్దులవాండ్లపల్లి తండాలో ఇంటి పని చేస్తుండగా కాలు జారి కిందపడ్డాడు. దీంతో ముక్కు, చెవుల్లో రక్తం కారడంతో వెంటనే చికిత్స కోసం కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మృతుడికి భార్య తులసీబాయి, ఇద్దరు కుమార్తె ఉన్నారు.