అనంతపురం

తెదేపాతోనే గ్రామాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 12 : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగసముద్రం గ్రామంలో జరిగిన గ్రామ దర్శిని, గ్రామ వికాసంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ గ్రామంలో రూ.20 లక్షలతో పశువైద్యశాలను నిర్మించడం జరిగిందన్నారు. వీటితోపాటు రూ.7 లక్షలతో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించామన్నారు. అదేవిధంగా రూ.1.30 కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డుకు మంత్రి భూమిపూజ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఈ సందర్బంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా రాప్తాడును తీర్చిదిద్దుతామన్నారు. దశల వారీగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.