అనంతపురం

ధర్మయుద్ధానికి సిద్ధం కండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం, జనవరి 23 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ధర్మయుద్ధానికి టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలని మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని చిందనూరు కల్యాణ మంటపంలో నిర్వహించిన బూత్, సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మరోసారి బలపరిచేందుకు ప్రతి కార్యకర్త ముందడుగు వేయాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై చైతన్యవంతులను చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న సమయంలో మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇందుకు బూత్ కన్వీనర్లు, పార్టీ సమన్వయకర్తలు నిరంతరం శ్రమించాలన్నారు.