అనంతపురం

వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, మే 13 : మండల పరిధిలోని గోపిందేవరపల్లిలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో వేంకటస్వామి (40) మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కర్నాటక జీలాగుంట గ్రామానికి చెందిన వేంకటస్వామి గురువారం గోపిందేవరపల్లికి వచ్చాడు. అదేరోజు సాయంత్రం అక్కడే ఉన్న ఓ దుకాణంలో కల్లు తాగుతూ ఉన్నఫళంగా కిందపడి మరణించాడు. విషయం తెలుసుకున్న బంధువులు గోపిందేవరపల్లికి చేరుకుని మృతదేహాన్ని ఎత్తనివ్వకుండా రాత్రి 10 గంటల దాకా అక్కడే ఉంచారు. తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని ఇక్కడ నుండి తీసేదిలేదని పోలీసులతో అర్కొన్నారు. ఎట్టకేలకు పోలీసులు మృతుని తమ్ముడు గోవిందప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వేంకటస్వామి రోజూ గోపిందేవరపల్లి గ్రామానికి వచ్చి కల్లు తాగేవాడని గ్రామస్థులు పేర్కొన్నారు.