అంతర్జాతీయం

శాంతికి ప్రతీకలు.. బోహ్రా ముస్లింలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 14: భారత సంస్కృతిలో వసుధైక కుటుంబం భాగమని, బోహ్రా ముస్లింలు ఈ భావనను అందిపుచ్చుకుని అమలు చేస్తున్నారని ప్రధాన నరేంద్రమోదీ ప్రశంసించారు. వసుధైక కుటుంబం అనే భావన ప్రాచీన భారతీతత్వానికి నిదర్శనమన్నారు. శాంతి, సహజీవనం అనే ఉదాత్తమైన సందేశాలను ప్రపంచానికి బోహ్రా ముస్లింలు చాటుతున్నారని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ బోహ్రా ముస్లింలు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సైఫీ మసీదులో జరిగిన ఈ కార్యక్రమానికి సైదానా మఫ్తాద్దాల్ సైఫుద్దీన్ అనే ఆధ్యాత్మిక వేత్త పాల్గొన్నారు. షియా ముస్లింలలో బోహ్రా ముస్లింలు ఒక తెగ. వీరు ఎక్కువగా వాణిజ్య రంగంలో ఉ టారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీని బోహ్రా ముస్లింల ఆధ్యాత్మికవేత్త సైఫుద్దీన్ సత్కరించారు. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి నివాళులు అర్పిస్తూ, ఆషారా ముబారాకా అనే కార్యక్రమాన్ని బోరా ముస్లింలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్ గతం ఎంతో విశిష్టమైంది. అద్భుతమైన భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నామన్నారు. వర్తక రంగంలో నిజాయితీతో కూడిన వ్యాపారం చేయడంలో బోహ్రాలు ముందుంటారన్నారు. కొంత మంది వర్తకులు వ్యాపారంలో ఫ్రాడ్‌కు పాల్పడుతుంటారన్నారు. దేశంలో వర్తకుల లావాదేవీలకు సంబంధించిన పన్నులను ప్రక్షాళన చేసి జీఎస్‌టీ ప్రవేశపెట్టామన్నారు. జీఎస్‌టీ, దివాలా ప్రక్రియ చట్టానికి పెద్ద ఎత్తున వర్తకులు, వాణిజ్యవేత్తలు మద్దతు ఇచ్చారన్నారు. మహాత్మాగాంధీకి బోహ్రా ముస్లింలతో ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. సైదనా మహమ్మద్ బుర్హనుద్దీన్ అనే మత పెద్ద గాంధీకి చేరువైన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. దండి మార్చిలో కూడా బుర్దనుద్దీన్ నేతృత్వంలో బోహ్రా ముస్లింలు పాల్గొన్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ అంటే విదేశీపెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని, పెద్ద ఎత్తున ఇనె్వస్టర్లు పెట్టుబడులు మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ పెట్టుబడుల వల్ల ఇక్కడే మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఇతర వాణిజ్య ఉత్పత్తుల తయారీ పెరిగిందన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఎనిమిది శాతం నమోదైందన్నారు. వృద్ధిరేటు అంకెల్లో ఉండేందుకు చేరుకోవాలని లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వైద్య రంగం, పౌష్టికాహారం అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఔషధాల ధరలు కూడా గణనీయంగా తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశార. దేశంలో 50 కోట్ల మందికి ఆయూష్మాన్ భారత్ స్కీంకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ పాల్గొన్నారు.