ఆంధ్రప్రదేశ్‌

హుబ్లీలో కిడ్నాప్‌కు గురైన బాలికలు తిరుపతి రైల్వే స్టేషన్లో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 17: కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఓ నయవంచకుడు మాయమాటలు చెప్పి ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి తిరుపతికి తీసుకువచ్చిన సంఘటన సోమవారం అర్థరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో గుర్తించారు. ఆపై వారి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చి వారికి పిల్లలను అప్పగించారు. హుబ్లీకి చెందిన ఎన్.స్పూర్తి (13), సుభా (11) అనే ఇద్దరు అమ్మాయిలు దాదాపీర్ అనే 36 ఏళ్ల యువకుడు వారికి మాయమాటలు చెప్పి హుబ్లీ, తిరుపతి ప్యాసింజర్‌లో సోమవారం అర్థరాత్రి తిరుపతికి తీసుకువచ్చాడు. వారిని విశ్రాంతి గదిలో ఉంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్ కానిస్టేబుల్ వారిని గుర్తించి ప్రశ్నించాడు. వారు చెప్పిన సమాధానాలతో కిడ్నాప్‌కు గురైన విషయం తెలుసుకుని డిఎస్పీ రాజయ్య, సీ ఐ ఆశీర్వాదంకు సమాచారం అందించాడు. ఇక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం హుబ్లీ పోలీసులు పిల్లల తల్లితండ్రులను తీసుకుని తిరుపతి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. పిల్లలను వారి తల్లితండ్రులకు అప్పగించారు. నిందితుడికోసం గాలిస్తున్నారు.