ఆంధ్రప్రదేశ్‌

ఐదుకోట్ల ఆంధ్రుల ప్రయోజనాల కోసమే 12 గంటల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తాను శుక్రవారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలవరకు 12 గంటలపాటు ఆహారం ముట్టకుండా ధర్మ పోరాట దీక్షను చేయబోతున్నానని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా మాత్రమే సత్యాగ్రహం చేస్తున్నానంటూ ఈమేర ఆయన గురువారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇదే సమయంలో విపక్షాల విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. మన రాష్ట్రానికి కేంద్రం వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు మనమందరం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఆఖరి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి అన్యాయమే చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆస్తుల అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్లు, తిరిగి చెల్లింపుల్లో మిక్కిలి నష్టం జరిగిందన్నారు.
విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం చెయ్యాలి, అలాగే రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి, ఉక్కు కర్మాగారం స్థాపించాలి, ఓడరేవు రావాలి, పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు కావాలి, నియోజకవర్గాల సంఖ్య పెరగాలి, అనేక విద్యా, పరిశోధన సంస్థలు ప్రారంభించాలి. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాల్సి ఉందన్నారు. అసలు విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదింప చేయడానికి ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆరు హామీలతో కూడిన ప్రకటన చేసారన్నారు. అందులో ముఖ్యమైనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్నందున ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీ చేయడం, బుందేల్‌ఖండ్, కోరాపుట్-బోలాంగిర్-కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించాలన్నారు. కానీ ఇప్పుడు రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు. ఓడరేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమకు సుమారు ఐదువేల కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు. ఇదేమి విడ్డూరమో అన్నారు. విద్యాసంస్థల పురోగతి మందంగా ఉందన్నారు. ఇప్పడు ఇస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే ఇరవై యేళ్లకైనా పూర్తవుతాయా అన్న సందేహం కలుగుతోంది. పట్టణాలకు డ్రైనేజీకి ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్లు చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి కుట్ర పూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉందన్నారు. ఇక పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. మన ప్రజల చిరకాల స్వప్నం. ఏడు ముంపు మండలాలను మనకు బదలాయించిన తర్వాత కేంద్రం నుంచి అందాల్సిన సాయం మందగించిందన్నారు. ఖర్చు చేసిన సుమారు మూడువేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉందన్నారు. దీని వడ్డీ భారం మనం మోయాల్సి వస్తోందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల దరిమిలా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ప్రస్తుతం హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమనీ కేంద్రం చెప్పిందన్నారు. హోదా బదులు దానికి సరిసమానమైన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక సహాయాన్ని ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమీ రాకపోగా, ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వడం, పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారన్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదని అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షుడు, సభ్యులు బహిరంగంగా చెప్పారంటూ బాబు గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్థిక సంఘం చెప్పనప్పుడు, రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రస్తుత హోదా రాష్ట్రాలకు కొనసాగిస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని తాను ప్రశ్నిస్తున్నానంటూ ఏది ఏమైనా ఇచ్చి తీరాల్సిందేనని బాబు డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రం పట్ల బాధ్యత ఉందని, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, అన్యాయంగా విభజన జరిగి కష్టాల్లో ఉన్న మన రాష్ట్రం పట్ల ఆ బాధ్యత మరింత ఎక్కువ. మనం నిలదొక్కుకుని మన కాళ్ల మీద మనం నిలబడేంత వరకు కేంద్రం చేయూత అందించాలన్నారు. తాను చేపట్టబోతున్న ఈ ధర్మపోరాట దీక్షలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, రాష్ట్రానికి చెందినవారు కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భాగస్వాములు కావాలని, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి తమ వంతు కృషి చేయాలని బాబు పిలుపునిచ్చారు.