ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ హుండీ ఆదాయం 2.4 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 April 2018
విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఏప్రిల్ 21: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీలను లెక్కించగా 2కోట్ల 4లక్షల 73వేల 368 రూపాయల ఆదాయం లభించింది. అదే విధంగా 550 గ్రాముల బంగారం, 5.5కిలోల వెండి లభించాయి. శనివారం ఉదయం శ్రీ మల్లికార్జున మహామండపంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవోఎం పద్మ ఆదేశాల మేరకు ఆలయ సహాయ ఈవో శ్రవణం ఆచ్యుతరామయ్యనాయుడు ఆధ్వర్యంలో వివిధ సెక్షన్లకు చెందిన సిబ్బంది 29 హుండీలను 23 రోజుల ఆదాయాన్ని లెక్కించారు.