ఆంధ్రప్రదేశ్‌

హిందూపురంలో బాలయ్య, మోదీపై ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 21: ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నాయకులు, ప్రధాని మోదీపై టీడీపీ నేతలు పరస్పరం శనివారం ఫిర్యాదు చేశారు. విజయవాడ ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణపై అనంతపురం జిల్లా హిందూపురంలో బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగిస్తున్న మోదీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.