ఆంధ్రప్రదేశ్‌

సహజ వనరుల దోపిడీలో దిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 12: సహజవనరులను దోచుకోవడంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను మించిన వ్యక్తి దేశంలో మరెవ్వరూ లేరని రాష్ట్ర ఐటి, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్న సహజవనరులను దోచుకోవడంలో జగన్ దిట్ట అని ట్విట్టర్ వేదికగా మంగళవారం లోకేష్ ఘాటైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలపై వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు, విమర్శలకు ట్విట్టర్ వేదికగా లోకేష్ స్పందించారు. సహజ వనరులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఏ1 నిందితుడైన జగన్ ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. జగన్ తీరు రాష్ట్రం మొత్తం తెలసునన్నారు. తండ్రి పాలనను అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్న నువ్వు ఏమైనా మిగిల్చావా అని జగన్‌ను ప్రశ్నించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాల కింద ఇసుక, ఖనిజాలు, బాక్సైట్, సున్నపురాయిని జగన్ తీంటారంటూ విమర్శించారు. 13 చార్జి షీట్లలో జగన్ దోచుకున్న మెనూ మొత్తం ఉందంటూ లోకేష్ ఎదురుదాడి చేశారు.