ఆంధ్రప్రదేశ్‌

ఇదో లంచగొండి రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 15: రాష్ట్రంలో లంచగొండి రాజ్యం కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి వేళ్లూనుకు పోయిందని, దీంతో కిందిస్థాయి నుంచి పైవరకు దోపిడీ కొనసాగుతోందని అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఏడాదికాలంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో లంచగొండి అధికారుల నుంచి రూ.2,500 కోట్ల విలువైన అక్రమాస్తులు స్వాధీనమయ్యాయన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసిందని, అలాగే హోదా, విభజన హామీలపై సీఎం చంద్రబాబు, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఆహా.. ఓహో.. అంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, శాసనసభలో ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు ఇద్దరూ ముఖ్యమంత్రిని తిట్టడం, కేంద్ర బీజేపీ పెద్దలకు బాకాలు ఊదడం చేయడంతోనే కాలం వెల్లదీస్తున్నారని చురకలు అంటించారు. నాలుగేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని, దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులకు సత్తా ఉంటే విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు.