ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీని ముంచెత్తిన గుర్రపుడెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: రాష్ట్రంలో నీటిపారుదలకు సంబంధించిన అన్ని కాలువలను వర్చువల్ విధానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ కేంద్రం నుంచి ఆయన ప్రకాశం బ్యారేజీని డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వర్చువల్ తనిఖీ నిర్వహించారు. బ్యారేజీలో గుర్రపుడెక్క ఆకులు పేరుకుపోయి ఉండటంపై ఆయన నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించారు. ఇన్ని రోజులుగా బ్యారేజీలో గుర్రపు డెక్క ఆకు అలా పేరుకుపోయి ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీలో పరిస్థితి అలా ఉంటే మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుర్గాఘాట్, తదితర ప్రాంతాలను కూడా ఆయన వర్చువల్ తనిఖీ చేశారు. నాలుగురోజుల్లో ప్రకాశం బ్యారేజీలోని నీరు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి కాలువలన్నీ కూడా ఇదే తరహాలో వర్చువల్ తనిఖీ చేస్తానని తెలిపారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి వర్చువల్ తనిఖీలు చేస్తానని, నీటి పారుదలకు ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ జరుగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి ఆర్టీజీ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. పింఛన్ల పంపిణీపై 79 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ 21 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాలు విశే్లషించి ఆ లోపాలను భర్తీచేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 47,20,253 మంది పింఛన్లు అందుకుంటున్నారని, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.549 కోట్లు పంపిణీ చేస్తోందన్నారు. కొన్నిచోట్ల వేలిముద్రలు పడని సమస్యలు వచ్చాయని, అక్కడ ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దెయ్యాలు పింఛన్లు తీసుకునేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎంతో పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి వ్యవస్థ ఉందా చెప్పండి? అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఇదే స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరని, అందరూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాల్సిందేనని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు రాజవౌళి, గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సాగునీటి కాలువలను వర్చువల్ తనిఖీ చేస్తున్న ముఖ్యమంత్రి