రాష్ట్రీయం

ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్నోహన్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. లోకసభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న అన్నీ పార్టీలు కూడా తమ అజెండాలను వివరించారేగానీ ప్రత్యేక హోదాను ప్రస్తావించలేదని విమర్శించారు. రాహుల్ సైతం తన ప్రసంగంలో ఏపీ గురించి అర నిమిషం కూడా మాట్లాడలేదని అన్నారు. ఏపీ ప్రజలు కోసం చేస్తున్న ఈ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని సహకరించాలని కోరారు.