ఆంధ్రప్రదేశ్‌

పిల్లల్లో చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: పిల్లల్లో చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన జీవన శైలిపై జి.నిర్మల తేజశ్రీ గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గురువారం రాత్రి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రలేఖనాన్ని ప్రోత్సహించాలన్నారు. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్‌లో రికార్డును తేజశ్రీ నమోదు చేసినట్లు సీఎంకు ఆమె తండ్రి బాలకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, సీఎం కార్యదర్శి గిరిజా శంకర్ పాల్గొన్నారు.