ఆంధ్రప్రదేశ్‌

క్వారీ పేలుళ్లలో గాయపడిన కార్మికుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 10: కర్నూలు జిల్లాలో జరిగిన క్వారీ పేలుళ్లలో గాయపడిన మరో కార్మికుడు శుక్రవారం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలోని క్వారీలో గత శుక్రవారం జరిగిన పేలుడులో 10 మంది అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడని ముగ్గురిలో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిషాకు చెందిన రాజేంద్రనాయక్ మంగళవారం మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు పాండవ్(40)ను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ ఆసుపత్రికి వాహనంలో తరలిస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి సమీపంలో మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కు చేరుకుంది. పాండవ్ స్వస్థలం ఒడిషా రాష్ట్రం బరంపురం జిల్లా గాజూర్ గ్రామం.