ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం టవర్ ఎక్కిన ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, ఆగస్టు 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఉద్యోగి పీ భాస్కర్ శనివారం సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు, ఎమ్మెల్యే నచ్చజెప్పడంతో మధ్యాహ్నం కిందికి దిగాడు. హోదా విషయంలో కేంద్రం ధోరణిని నిరసిస్కూ భాస్కర్ ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. అంతకుముందు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, బంధువులు, పోలీసులు అక్కడికి చేరుకుని కిందికి దిగాలని నచ్చజెప్పారు. అయినా ససేమిరా అనడంతో ఎమ్మెల్యేలు సూర్యనారాయణరెడ్డి, ప్రభాకర్‌చౌదరి నచ్చజెప్పి కిందికి దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.