ఆంధ్రప్రదేశ్‌

ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం శ్రీశైలం ఆలయంలోని కరివెన వారి సత్రంలో జరిగింది. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం అఖిల భారత కరివెన సత్రం కోశాధికారి టీవీ రమణ అధ్యక్షతన జరిగింది. సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడుగా కొప్పరపు బలరామకృష్ణమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎన్వీ రామరాజు, అధ్యక్షుడుగా ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా ఇసుకపల్లి కామేశ్వరప్రసాద్, సిరిపురపు శ్రీ్ధర్ శర్మ, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడుగా కొత్తపల్లి అజయ్‌కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడుగా పసుపుల మురళీకృష్ణ, రాష్ట్ర అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడుగా రొంపిచర్ల రాజా కృష్ణమాచార్యులు, రాష్ట్ర కోశాధికారిగా రేపాక శేషాచలంతో పాటు 50మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా టీవీ రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాఖ్య నిరంతరం పోరాడాలన్నారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుండి వందలాది మంది బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.