ఆంధ్రప్రదేశ్‌

హత్తిబెళగల్ క్వారీ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూరు, ఆగస్టు 12 : కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని హత్తిబెళగల్ క్వారీ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ నెల 3వ తేదీ జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
అయితే చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు విశాఖపట్టణానికి తరలిస్తుండగా మృతిచెందారు. వారికి తోడు శనివారం అర్ధరాత్రి రామచంద్రనహక్(52) చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మృత్యుల సంఖ్య 13కు చేరింది.
దీంతో రామచంద్రనహక్ మృతదేహాన్ని ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా బందర్‌నూహాన్ గ్రామంలోని వారి బంధువులకు అప్పగించేందుకు ప్రత్యేక వాహనంలో తరలించినట్లు ఆలూరు పోలీసులు తెలిపారు.
ఇక కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు వికాస్, దిలీప్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు ఆలూరు పోలీసులు తెలిపారు.