రాష్ట్రీయం

లక్ష గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, మార్చి 19: దేశంలోని లక్ష గ్రామాల్లో ఈసారి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. శనివారం శ్రీ కాళహస్తీశ్వరాలయానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడానికి వి హెచ్ పి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలను ఎంపిక చేసి గ్రామమహోత్సవాల పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి 5వేల ఎకరాల భూములున్నాయని, వాటిల్లో చాలాచోట్ల చర్చలు, మసీదులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.