ఆంధ్రప్రదేశ్‌

అందరం శ్రమిస్తేనే అత్యుత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 5: ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్థులకు ఉందని, ఆ దిశగా వారిని నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాన్ని మేలైన మానవ వనరులకు గమ్యస్థానంగా మలచాలని, ఈ బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. మానవ వనరుల అభివృద్ధికే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బుధవారం మంగళగిరిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్టప్రతిగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనమని గుర్తుచేశారు. అదేపట్టుదల, స్ఫూర్తి ఇప్పుడు అందరికీ కావాలన్నారు. రాధాకృష్ణన్ వంటి వ్యక్తి తెలుగు గడ్డపై పెరగడం మనకు గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వివరించారు. తాను రాష్ట్రంలో నెంబర్ వన్ కూలీలా కష్టపడుతున్నానని, అందరం అదేస్థాయిలో శ్రమిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. తనను జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసింది గురువులేనని, తనకు వారిపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపేదిగా చదువు ఉండాలని ఆకాంక్ష వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి ఒత్తిడి నడుమ విద్యను అభ్యసించే పరిస్థితి ఉండకూడదని, ఆహ్లాదంగా, ఆనందంగా విద్యను ఆర్జించేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు 24 గంటలు తరగతి గదుల్లోనే గడపకుండా ప్రకృతిని ప్రేమిస్తూ సేదతీరాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నరేగా నిధులతో ప్రహరీ గోడలు నిర్మించడంతో సహా 2022 నాటికి అన్ని జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు సిద్ధం చేయాలని సంకల్పించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తున్నామని, అలాగే ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపడతామని చెప్పారు. డ్రాప్ అవుట్స్ భారీగా తగ్గించగలగడం, 2014కు ముందు విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రస్తుతం దేశంలోనే 3వ ర్యాంకులో నిలబెట్టడం ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, హైస్కూళ్లు కూడా సరిపడాలేని రంగారెడ్డి జిల్లాలో 200కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పేలా చూశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు తరలివస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్ర రాజధానిలోనూ ఇన్ని విద్యాసంస్థలు లేవన్నారు.
నిత్య విద్యార్థి సీఎం : మంత్రి గంటా
విద్య, విజ్ఞానం అంటే ఎంతో ఆసక్తి చూపే ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా విద్యాభివృద్ధికి 25 వేల కోట్లు ఖర్చుపెట్టారని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎంతో జ్ఞానం ఉన్నా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముఖ్యమంత్రి నిత్య విద్యార్థిలా ముందుంటారని చెప్పారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు.

చిత్రాలు..సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
* సీఎంను సత్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు