ఆంధ్రప్రదేశ్‌

అధికార దాహంతోనే బాబు అపవిత్ర పొత్తులు:కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/ విజయవాడ, సెప్టెంబర్ 12: అధికారం కోసం ఎవ్వరితోనైనా నిస్సిగ్గుగా ఎన్నికల పొత్తులు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదమని గతంలో ఒకసారి ప్రకటించి మోదీ చరిష్మాను గుర్తించి అధికారం కోసం తిరిగి చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇది మరువకముందే తెలంగాణలో కాంగ్రెస్‌తో ఆయన పొత్తుకు సిద్ధం కావడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బుధవారం గుంటూరు కన్నావారితోటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందన్నారు. ఇటలీ గాడ్సే సోనియా అంటూ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన బాబు ఆమె పార్టీతోనే పొత్తుకు సిద్ధం కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు పొత్తుల విషయంలో తెలంగాణ నేతలకే వదిలేస్తున్నానని చెప్పడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. ఊసరవెల్లికే పాఠాలు నేర్పే ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తన అధికార దాహం కోసం, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, అరాచకాలను సమర్థించుకోవడం కోసం మోదీపై అనేక నిందలు మోపుతున్న చంద్రబాబు నైజం అన్నం పెట్టిన చేతిని నరకడమని విరుచుకుపడ్డారు. టీడీపీ స్వర్గీయ ఎన్టీఆర్‌తోనే అంతరించిందని, ఇప్పుడున్నది తెలుగుడ్రామా కంపెనీ అని ధ్వజమెత్తారు.
సీఎంకు మరో ఐదు ప్రశ్నలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెండర్ల రద్దు కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సీఎం చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. కన్నా బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రైవేట్ సంస్థలకు ఆ కాంట్రాక్ట్‌ను ధారదత్తం చేసేది ముడుపులు, కమిషన్‌లు అందుకోటానికేనా? అని విమర్శించారు. ఓ వైపు పేద రాష్ట్రానికి కట్టుబట్టలతో వచ్చామని కథలు చెబుతూ ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా దుర్వినియోగం చేయడం లేదా? అన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా చ. అడుగుకు రూ. 11వేలు వెచ్చించి అమరావతిలో సచివాలయం అసెంబ్లీలను నిర్మిస్తే రెండురోజుల వర్షానికే లీకేజీలా? అన్నారు. ఈ మొత్తం కుంభకోణాలపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీపీ పాలనలో మహిళా ఉద్యోగినులపై జరుగుతున్న లైంగిక దాడులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అన్నారు.