ఆంధ్రప్రదేశ్‌

మైనారిటీలంటే ఎందుకంత కక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: మైనారిటీలంటే ఎందుకు అంత కక్ష అని వైకాపా అధినేత జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ప్రశ్నించారు. ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్‌కు శనివారం షరీఫ్ బహిరంగ లేఖ రాశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో రాజ్యసభ సీటు ముస్లింలకు కేటాయిస్తానని హామీ ఇచ్చి మైనారిటీలకు మొండి చేయి చూపించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలుగా, వివిధ సంస్థలకు చైర్మన్‌లుగా ముస్లింలను టీడీపీ నియమించిందని, ఓట్ల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి హడావుడిగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారని ఆరోపించారు. 2014కు ముందు మోదీని మతతత్వ బూచిగా చూపించి ఓట్లు వేయించుకున్నాక, మోదీకి లొంగి మైనారిటీలను మోసం చేయలేదా అని ప్రశ్నించారు. ముస్లిం విద్యార్థులకు విదేశీ చదువులు, హజ్ హౌస్‌ల నిర్మాణం వంటివి టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. జగన్, రాజశేఖర రెడ్డి ముస్లింలకు ద్రోహం చేయగా, మైనారిటీల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.