ఆంధ్రప్రదేశ్‌

ఆపద్బాంధవులు మీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 16: వరదల బీబత్సంతో ఆపదలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని పెద్దమనసుతో ఆదుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10కోట్లతో పాటు ప్రజలు, ఉద్యోగులు, ఇతర సంస్థల ప్రతినిధులు విరాళంగా అందజేసిన నగదు, ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయ వస్తు సామగ్రి, జిల్లా యంత్రాంగాలు, వివిధ సంస్థల నుంచి వచ్చిన 40.148 కోట్ల రూపాయల విలువైన సాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.
ఇందుకు కేరళ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. దేశ పౌరులు కష్టాల్లో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరుణతో, శ్రద్ధతో, పెద్దమనసుతో స్పందించటం అపూర్వమన్నారు. ‘విపత్తులలో మమ్మల్ని మీరు, మీ రాష్ట్ర ప్రజలు ఆదుకున్న తీరు భారతీయ సౌహార్ధ్ర సంబంధాలకు నిదర్శనం. సాటి భారతీయులుగా ఇలాంటి స్పందనకు మేము గర్విస్తున్నాం’ అంటూ లేఖలో విజయన్ పేర్కొన్నారు.

చిత్రం..కేరళ ముఖ్యమంత్రి విజయన్