ఆంధ్రప్రదేశ్‌

కన్నాను మించిన భూ బకాసురుడు లేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన భూ బకాసురుడు మరొకరు లేరని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వారానికి ఐదు ప్రశ్నలు వేస్తానంటున్న కన్నాకు తాము పది ప్రశ్నలు వేస్తున్నామని, చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పదేళ్ళు మంత్రిగా ఉన్న కన్నా అప్పటి ల్యాండ్ మాఫియాలో భాగస్వామి కాదా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో భూ కబ్జాలు, భూ కుంభకోణాల్లో పాత్ర లేదా అని, విశాఖలో కన్నా కొడుకు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి జరిగిన ప్రయోజనాలపై చర్చిద్దామా అని అన్నారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో కన్నా నాగరాజు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి ఐదు ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఒకప్పుడు సైకిల్‌పై తిరిగిన సాధారణ గుమస్తా అయిన కన్నా గుంటూరు కన్నా వారితోటలో ఇంద్రభవనాలకు అధిపతి ఎలా అయ్యారని, ఢీల్లీలో అపార్ట్‌మెంట్‌లు, పరవాడ, తుర్కపాలెం వద్ద భూములు ఏ వ్యాపారం చేసి ఆర్జించాడని నిలదీశారు. రాంకీ సంస్ధ, ఫార్మాసిటీకి విశాఖలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ మినహాయింపుల వెనుక ఉన్నది ఎవరని అన్నారు. ముందు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అప్పుడు తమ నాయకుడిపై విమర్శలు చేయాలన్నారు.