ఆంధ్రప్రదేశ్‌

అఖిల భారత నర్సరీ రైతు సంఘ ఉపాధ్యక్షునిగా పుల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, సెప్టెంబర్ 23: అఖిల భారత నర్సరీ రైతు సంఘానికి చెన్నైలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షునిగా కడియపులంక సత్యదేవ నర్సరీకి చెందిన పుల్లా వీర వెంకట్రావు విజయం సాధించారు. ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్‌కు పాలనా కాలం ముగియటంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష తదితర పదవులకు దేశ వ్యాప్తంగా నర్సరీ రైతులు పోటీపడటంతో బ్యాలెట్ విధానంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా గుజరాత్‌కు చెందిన సమీర్‌బాయ్ విజయం సాధించగా, ప్రధాన ఉపాధ్యక్షునిగా జగటమ్ ఎంపికయ్యారు. అలాగే మిగిలిన అయిదు ఉపాధ్యక్ష పదవుల్లో పుల్లా వీర వెంకట్రావు ఒకరిగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా బుర్లంకకు చెందిన తాడాల రవికుమార్ విజయం సాధించారు. ఇప్పటి వరకూ అధ్యక్షునిగా కొనసాగిన పల్ల సుబ్రహ్మణ్యం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేశారు.