ఆంధ్రప్రదేశ్‌

టి.బీజేపీ సేవలో గవర్నర్ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 24: ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఎంతో బిజీగా ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో జరిగిన అతి భారీ కుంభకోణం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై గవర్నర్‌కు లేఖ ఇవ్వాలని కోరితే అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వలేనంతగా బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు లేఖ ఇస్తే తీసుకునే పరిస్థితిలో గవర్నర్ లేరనే విషయం అవగతం అవుతోందన్నారు. సోమవారం నగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. గవర్నర్ స్థాయిలో ఆయన బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్నందున ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా తమపై గవర్నర్ల దగ్గరకెళ్లి వ్యతిరేక లేఖలిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ అజెండాలో భాగంగానే గవర్నర్ తమ ఫిర్యాదు అందుకోటానికి సుముఖంగా లేరని, ఇది రాష్ట్రానికి జరిగిన అవమానంగా తాము భావిస్తున్నామని చెప్పారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని, ఇందులో భాగంగా మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 2019 అక్టోబర్ 2వరకూ జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామస్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరించటంతో పాటు టీడీపీ, బీజేపీ, జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ పాల్గొనడం, సభ విజయవంతం కావడం పార్టీలో నూతన ఉత్సాహం నింపిందన్నారు. అధికారంలోకి రాగానే హోదాపై సంతకం చేయనిదే రాష్ట్రంలో అడుగుపెట్టనన్న విషయంతో పాటు కష్టాల్లో ఉన్న ప్రతి రైతుకు 2లక్షల వరకూ రుణమాఫీ చేస్తామనడం హర్షదాయకమని రఘువీరారెడ్డి వివరించారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాశరెడ్డి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, మస్తాన్ వలీ, సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, సిరివెళ్ల ప్రసాద్, క్రిస్ట్ఫార్ తిలక్, సీడీ మోయప్పన్ పాల్గొన్నారు.