ఆంధ్రప్రదేశ్‌

తుపాను బాధితులకు విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: తిత్లీ తుపాను బాధితుల సహాయార్ధం బాలయ్య అభిమానులు రూ.1.71 లక్షల రూపాయలు విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం అందచేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మనబాలయ్యడాట్‌కామ్ నిర్వాహకుడు పి.గౌతం ఈ మేరకు విరాళాన్ని అందచేశారు. తుపాను బాధితుల సహాయార్థం కళాశాల అధ్యాపకుల ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఫెడరేషన్ ఆఫ్ ఏపీ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అందచేసింది. గ్రీవెన్సు హాల్‌లో సీఎంను కలిసి చెక్ ఆ అసోసియేషన్ ప్రతినిధులు అందచేశారు. కష్టాలపాలైన ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలను సీఎం అభినందించారు. ఇదే స్ఫూర్తి సమాజంలోని అన్ని వర్గాల్లో కనిపించాలన్నారు. రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలల్లో గెస్టు ఫ్యాకల్టీలుగా పని చేస్తున్న 1000 మంది అధ్యాపకుల వేతన సమస్యను పరిష్కరించాలని ఆ సంఘం ప్రతినిధులు సీఎంకు వినతిపత్రం అందచేశారు. ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతులు అందించేందుకు వచ్చే వారికి వారి సమస్యలు తెలుసుకుని, భోజనం పెట్టి పంపించాలని అధికారులకు సూచించారు.