ఆంధ్రప్రదేశ్‌

29న తిత్లీ బాధితులకు చెక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: తిత్లీ తుపాను బాధితులకు ఈ నెల 29న నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తుపాను సహాయక చర్యలపై ప్రజల్లో సంతృప్తి శాతం 61శాతానికి పెరిగిందని, త్వరలో తిత్లీ ఉద్దానం రీకన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ (తూర్పు)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తుపాను సహాయక చర్యలపై ఉండవల్లి గ్రీవెన్స్ హాల్ నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తుపాను సహాయక చర్యలు చేపట్టి 11 రోజులైందని చంద్రబాబు చెప్పారు. సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయన్నారు. అన్ని పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
సహాయక పనుల్లో అసాధారణ సామర్థ్యం చూపారని, బాగా కష్టపడి పనిచేసిన వారికి ఈ నెల 29న అవార్డులు ఇచ్చి సత్కరించనున్నామని తెలిపారు. ఇదో భగీరథ యత్నమని, శారీరక కష్టంతో కూడుకున్నదన్నారు. హుదూద్ సమయంలో కన్నా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారన్నారు. ప్రజల ప్రశంసలే అసలైన అవార్డులని, ఆదివారం అన్ని శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని ఆయన తెలిపారు. విద్యుత్ పనులపై 50 శాతం, వైద్య సౌకర్యాలపై 73 శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 61శాతం మేర ప్రజాసంతృప్తి వ్యక్తమైందని, దీన్ని 76శాతానికి తీసుకెళ్లటం లక్ష్యమని చెప్పారు. అన్ని పనులు పూర్తిచేశాకే ఎవరైనా తిరిగి వెళ్లేదని, చివరికి వచ్చాం కదా అని అలక్ష్యం చేయొద్దని సూచించారు. ఈ రెండు రోజులు కష్టపడితే మన శ్రమకు సార్థకత చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఏ గ్రామానికి ఎంత నష్టం వచ్చింది? ఎంత సహాయం అందించిందీ గ్రామసభల్లో ప్రకటించాలన్నారు. గతంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అందరూ కలిసి పంచుకునేవారన్నారు. ఇటీవల రాజకీయాల వల్ల పెడధోరణలు పెరిగాయన్నారు.
అభివృద్ధిపై అంతటా సానుకూలత ఉండాలని, పునర్నిర్మాణంలో అందరూ తలో చేయి వేయాలన్నారు. 101 సబ్ స్టేషన్లు చార్జింగ్ చేశారని, 71 నీటి పథకాలు పని చేస్తున్నాయన్నారు. మరో 288 నీటి సరఫరా పథకాలు అందుబాటులోకి రావాల్సి ఉందని చెప్పారు.
అవసరం లేనిచోట్ల ఉన్న జనరేటర్లను ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. 34,120 విద్యుత్ స్తంభాల ఎర్పాటు భగీరథ ప్రయత్నమేనని, ఇందుకు 9952 మంది శ్రమిస్తున్నారన్నారు. భోజన సదుపాయాలపై ప్రజల నుంచి 73శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులు సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. హార్టికల్చర్, చిన్న దుకాణాలు, ఇళ్ల నష్టం వివరాల సేకరణ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. 29న అందరికీ చెక్కులు పంపిణీ చేసి, తరువాత ‘తూర్పు’ కార్యక్రమం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.